భీమ్బేట్కా శిలా గుహలు ప్రాచీన శిలా యుగం (పేలియోలిథిక్) నాటి పురావస్తు గుహలు. ఈ గుహలు భారతదేశంలో ఆదిమానవుడి ఉనికి తెలియజేస్తున్నాయి మరియు ఈ రకముగా దక్షిణ ఆసియా రాతి యుగం ఆరంభాన్ని కూడా చాటుతున్నాయి. ఈ గుహలు భారతదేశం లోని మధ్యప్రదేశ్ రాష్ట్రం రైసేన్ జిల్లా అబ్దుల్లాగన్జ్ పట్టణానికి సమీపంలోని రతపాని వన్యప్రాణి అభయారణ్యంలో ఉన్నాయి.ఇందులో కొన్ని గుహలో 1,00,000 (1 లక్ష) సంవత్సరాలకు పూర్వం హోమో ఎరక్టస్ అనే ఆది మానవ జాతి నివసించారు. ఈ గుహలలోని కొన్ని రాతి గుహ చిత్రాలు 30,000 సంవత్సరాలకు పై బడినవి. ఈ గుహలు పూర్వం నాట్యం యొక్క ఉనికి కూడా కనబర్చాయి. 2003 లో ఈ గుహలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ఆమోదించబడింది.
బీమ్ బేట్కా (भीमबेटका) అనే పేరు మహా భారతంలోని భీముడు వలన వచ్చింది. భీంబేట్కా అనే పదం భీమ్బౌట్కా (भीमबैठका) నుంచి వచ్చింది అంటే భీముడు కూర్చున్న ప్రదేశం.
యునెస్కో భీమ్ బేట్కా రాతి గుహలను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.1888 లో పురావస్తు శాఖ స్థానిక ఆదివాసీల కథనం ప్రకారం పూర్వం ఈ గుహలు బౌద్దా రామాలని నమోదు చేసింది. తరువాత ప్రముఖ భారతీయ పురావస్తు శాస్త్రవేతైన వీ.ఎస్. వకాన్కర్ రైలులో భుపాల్ కి వెళ్తుండ తాను స్పేన్ మరియు ఫ్రాన్స్ లో చూసిన గుహలను పోలిన వాటిని ఇక్కడ చూసాడు. తరువాత 1957లో వకాన్కర్ తమ బృందంతో కలసి ఈ గుహలు కనుగోన్నాడు.
మొత్తం 750 గుహలు కనుగోనగా అందులో 243 భీమ్ బేట్కా వర్గానికి మరియు 178 లకర్ జువార్ వర్గానికి చెందినవిగా గుర్తించారు.
గుహలోని ఏకశిల పై ఉపయోగించిన రంగుల యొక్క ముడిసరుకుకు బార్కేదా వనరుగా వ్యవహరించింది.
ఒకానోక ఏకాంతమైన రాతి గుహలో ఒక రాతి చిత్రం చెతిలో త్రిశూలం కలగి నృత్యం చూస్తున్న భంగిమలో ఉంది దీనికి డాక్టర్ వకాన్కర్ గారు నటరాజు అని నామకరణం చేసారు. ఈ చిత్రాలు వాతావరణ అవపాతం కోతకు గురై కోంతమేరకు చెరిగిపోయినవి ఇందు కోసం వాటిని సంరక్షించడానికి భారత పురావస్తు శాఖ రసాయనాలు మరియు మైనాన్ని ఉపయోగిస్తుంది.